...

...

13, జులై 2009, సోమవారం

రుణం

"రేయ్! నీ ఆలోచనా విధానంలోనే లోపముంది. నువ్వూ, నీలాంటివారు సమాజం గురించి, వ్యక్తులగురించి అవగాహన చేసుకొన్న తీరులో లోపముంది. మనిషి తనకు తానుగా బ్రతుకుతూ, తన పరిధి మేరా ఇతరులకు ఎలా సాయపడగలను అని ఆలోచించాలి. అంతేకాని పూర్తిగా ఇతరులకోసమే జీవించాలని నేను చెప్పడం లేదు. ప్రతీ మనిషీ ఇలాంటి దృక్పథం విధిగా అలవర్చుకోవాలి. చదువు రాని వారి విషయం వదిలేయ్! విద్యావంతులైన మనలాంటి వారు, ఉద్యోగస్థులు, లాయర్లు, అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపరస్థులు, విద్య నేర్చి ఏదో ఒక రంగంలో కృషి చేస్తున్నవారు, వివిధ వృత్తులు చేపట్టిన వారు, మేధావి వర్గం అని పిలువబడే వారు ఈ విధమైన ఆలోచనా ధోరణిని అలవరుచుకోవాలి. అంతేకాని కేవలం 'నా ఇల్లు, నా వాళ్లు, వాళ్ల బాగోగులే జీవితం' అన్న పంథాలో జీవించరాదు. 'నేను ఏ సమాజం నుంచయితే తిండి, బట్ట సంపాదించుకో గలుగుతున్నానో, అలాంటి సమాజానికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత మంచి చేసి చావాలి' అన్న ఆలోచనా సరళి కలిగి వుండాలి. అప్పుడే మనం నేర్చిన విద్యకు, వ్యక్తిగా మన జీవితానికి ఓ ప్రయోజనం చేకూరుతుంది. మనిష్ తన పరిథిలోనే ఇతరులకు సాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాకపోతే, ఎవరికి వారు, తమకేమీ పట్టనట్లుగా మార్గాలగురించి ఆలోచించటం లేదంతే! విద్యావంతులు, మేథావి వర్గంగా పిలువబడుతున్నవారే తమకేమీ పట్టనట్లుగా కేవలం తమ స్వార్థానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే, చివరికి సమాజంలో మంచి అన్నది కరువై, ఎటుచూసినా అశాంతి ప్రబలి అది విధ్వంసక ధోరణికి దారితీస్తుంది. సమాజాన్ని ఓ విషవలయంగా మార్చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నదదే!"

పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? పై సంభాషణ ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపింది? తెలుసుకోవాలంటే ఎస్.డి.వి.అజీజ్‌గారి కథ రుణం చదవండి.

కామెంట్‌లు లేవు: