...

...

8, మే 2015, శుక్రవారం

మొదటి తరం రాయలసీమ కథలు!

మొదటి తరం రాయలసీమ కథలు పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని అతి త్వరలో ప్రచురిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాము. జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలనుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉంటాయి. ఈ కథలన్నీ క్రీ.శ.1882 - 1944ల మధ్య ప్రకటించబడ్డాయి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకుడు. ఈ పుస్తకంలో కథలతో పాటు కథాలక్షణాలను వివరించే ఒక వ్యాసం 1927 జనవరి 15వ తేదీ శ్రీ సాధనపత్రికనుండి సేకరించినది అనుబంధంగా ఇస్తున్నాము. హెచ్.నంజుండరావు వ్రాసిన ఈ వ్యాసం చాలా విలువైనదని చదివిన వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇంకా ఈ పుస్తకానికి కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు వ్రాసిన పీఠికలుంటాయి. సరే సంపాదకుని ముందుమాట, ప్రచురణకర్త (అంటే నేను వ్రాసిన ) నోటు ఎలాగూ ఉంటాయి. ఈ పుస్తకం వెల 200/-. బహుశా మే నెల చివరి వారంలో వెలువడనున్న ఈ పుస్తకాన్ని నేడే రిజర్వు చేసుకోండి.