...

...

31, మే 2013, శుక్రవారం

సర్దేశాయి తిరుమలరావు పుస్తకం వెలువడింది!


డా. నాగసూరి వేణుగోపాల్ మరియు నా సంపాదకత్వంలో రెండవ పుస్తకం "జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు" వెలువడింది. సాహితీవిరూపాక్షుడువిద్వాన్ విశ్వం మాదిరిగానే ఈ పుస్తకంలో కూడా సర్దేశాయి తిరుమలరావుగారి ఎంపికచేసిన రచనలను (అంటే విమర్శలను, వ్యాసాలను, లేఖలను, నాటికలను, ఒక కథను) కొన్నింటిని, వాటితో పాటు తిరుమలరావుగారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, రచనలను పరిచయం చేసే వ్యాసాలను, ఇంటర్‌వ్యూను పొందుపరిచాము. భారతిలో సర్దేశాయి చేసిన రచనల జాబితా, తైలసాంకేతికరంగంలో వారి కృషిని తెలియజేసే పరిశోధనాపత్రాల జాబితా, వారి చేతిరాతను చూపేందుకు ఒక లేఖ, వారు సంపాదించిన అవార్డులు - రివార్డులు, కొన్ని ఫోటోలు అనుబంధంలో చేర్చాము. 264 పేజీలున్న ఈ పుస్తకం ధర రూ 150/-గా నిర్ణయించాము. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో ఈ పుస్తకం   లభ్యమవుతోంది. e- బుక్  మరియు ప్రింటెడ్ పుస్తకం  కినిగెలో కూడా లభ్యమవుతోంది. ఈ పుస్తకం కొని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.   

28, మే 2013, మంగళవారం

వెల్లంపల్లి అవినాష్ వ్రాసిన తాగుబోతు కథ కథాజగత్‌లో చదవండి. 

17, మే 2013, శుక్రవారం

వి.ప్రతిమ కథలు


2008లో 'ఈవారం జనవార్త'లో నేను వ్రాసిన వ్యాసం.




10, మే 2013, శుక్రవారం

ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడు!

శ్రీరంగం శ్రీనివాసరావు
విశ్వనాథ సత్యనారాయణ
గంటి శ్రీరామమూర్తి
తిరుమల రామచంద్ర
ఆర్.యస్.సుదర్శనం
జి.సత్యనారాయణ
వడలి మందేశ్వరరావు
పులిచర్ల సాంబశివరావు
డా.మురళీధర్
గుంటూరు శేషేంద్రశర్మ
ఆవంత్స సోమసుందర్
కొత్వాలు అమరేంద్ర
ఇస్మాయిల్
నిడుదవోలు వేంకటరావు
రామాచంద్రమౌళి
డా.ఆర్వీయస్ సుందరం
సాంధ్యశ్రీ
కొలకలూరి ఇనాక్
రావి రంగారావు
విహారి
గాధిరాజు సాల్మూరు
రేకళిగ మఠం వీరయ్య
హెచ్.యస్.బ్రహ్మానంద
కాకుమాను తారానాథ్
దాశరథి కృష్ణమాచార్య
దేవులపల్లి కృష్ణశాస్త్రి
శంకరగంటి రంగాచార్యులు
ములుమూడి ప్రసాదరావు
జానగాని కాటమయ్య
విజయ దత్తాత్రేయ శర్మ
ఎస్.గంగప్ప
సూర్యదేవర రవికుమార్
రోణంకి అప్పలస్వామి
ఆదవాని హనుమంతప్ప
కపిలవాయి లింగమూర్తి
ఇవటూరి యోగదుర్గ మల్లికార్జున
బి.నరసింహులు
కొత్తపల్లి వీరభద్రరావు
పాలకోడేటి జగన్నాథరావు
కోగిర జైసీతారాం
డా.తంగిరాల వెంకట సుబ్బారావు
వేదం వేంకటరాయ శాస్త్రి
శంకరగంటి రమాకాంత్
ఆచార్య జాస్తి సూర్యనారాయణ
డా.కాపు రామాంజనేయులు
డా.మాడభూషి భావనాచార్యులు ....

ఇలా వ్రాసుకుంటూపోతే ఈ జాబితాకు అంతే ఉండదు. 

పైన పేర్కొన్న వారందరికీ వున్న ఏకైక సామ్యము వారందరూ సర్దేశాయి తిరుమలరావుగారి విమర్శకు గురి అయినవారు కావడమే. వీరి ఎవరిపైనా తిరుమలరావు గారికి వయక్తిక ద్వేషం లేదు. పైగా కొందరంటే చాలా గౌరవం కూడా. వారివారి రచనల్లో ఏదో ఒక అంశాన్ని సర్దేశాయిగారు అంగీకరించక పోవడమే ఘాటైన విమర్శలకు మూలం. 1972-1990 మధ్యకాలంలో భారతి మాసపత్రిక సంచికలలో కలగూరగంప శీర్షికలో వచ్చిన వాదోపవాదాలు రసవత్తరంగా సాగాయి. ఈ చర్చోపచర్చలు చదవడానికి చాలా ఆసక్తిని కలిగిస్తాయి.


చాలా మందికి కొరుకుడు పడని ఈ విమర్శకుని గురించి తెలుసుకోవాలంటే త్వరలో మేము వెలువరిస్తున్న జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు చదవాల్సిందే.