...

...

31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!





2009లో మనం


ఒక పతంజలిని,



ఒక కాంతారావుని,


ఒక రాజశేఖర రెడ్డిని,


ఒక బాలగోపాల్‌ని


కోల్పోయాం. 




అయితేనేం వారు అందించిన స్ఫూర్తిని గైకొని  


రాబోయే కాలంలో పురోగమిద్దాం.  


బ్లాగు మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ  


నూతన సంవత్సర శుభాకాంక్షలు.

22, డిసెంబర్ 2009, మంగళవారం

తెరల కథ కమామీషూ...

ప్రముఖ రచయిత విమర్శకుడు శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు తెరతీయగరాదా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే యువకవి 'ముఠ్ఠీ'కావ్యకర్త   శ్రీ అన్వర్ తెరతీయనా అంటూ ఊరిస్తున్నారు. ఈ తెరలేమిటో, తెరతీయడాలేమిటో వారి కథల్ని కథాజగత్‌లో చదివి మీరే తెలుసుకోండి.

21, డిసెంబర్ 2009, సోమవారం

దేశభాషల్లో తురుపుముక్క!

ఇప్పుడు మీరు నా తురుపుముక్క బ్లాగును తెలుగు లిపిలోనే కాకుండా బంగ్లా,దేవనాగరి(హిందీ),గుజరాతి, గురుముఖి, కన్నడ, మళయాళం, ఒరియా, తమిళ్ లిపుల్లో చదవవచ్చు.

20, డిసెంబర్ 2009, ఆదివారం

"బుడ్డా వెంగళరెడ్డి" పుస్తకంపై సాక్షి ఫన్‌డేలో సమీక్ష!

ఈ రోజు సాక్షి దినపత్రిక (20-12-2009) ఆదివారం సంచిక ఫన్‌డేలో మా సంస్థ తరఫున ప్రచురించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవలపై సమీక్ష ప్రచురించారు. తురుపుముక్క పాఠకుల కోసం ఈ సమీక్ష ఇక్కడ పొందుపరుస్తున్నాం.





హైదరాబాదులోని బ్లాగర్లకు, పుస్తకాభిమానులకు ఒక సూచన. ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్టాల్ నెం.81లో(పాలపిట్ట బుక్స్) అమ్మకానికి లభ్యమౌతుంది.

వస్తున్నాయొస్తున్నాయి...

రాబోయే రోజుల్లో కథాజగత్‌లో మీరు చదవబోయే కథల వివరాలు.  
1.ఆచంట హైమావతి - చల్లారిన పాలు √  
2.రాచపూటి రమేష్ - ట్రంప్ కార్డ్  
3.కల్లూరు రాఘవేంద్ర రావు - ముదిమనసు  
4.ఎం.వి.జె.భువనేశ్వరరావు - అభాగ్యులు   
5.బులుసు -జీ-ప్రకాష్ - కుప్పిగంతులు √    
6.దూరి వెంకటరావు - ఓ ఇంటివాడు √    
7.ఎల్.ఆర్.స్వామి - సూర్యచంద్రులు √    
8.గోవిందరాజు రామక్రిష్ణారావు - శుభవార్త √   
9.జయంపు కృష్ణ - గొడ్డు  √  
10.వాలి హిరణ్మయీదేవి - స్థిత ప్రజ్ఞత  √ 
11.కాకాని చక్రపాణి - సంస్కారం    
12.ఇలపావులూరి మురళీమోహనరావు - నాకొక కుటుంబం కావాలి  
13.మునిపల్లె రాజు - కస్తూరి తాంబూలం  
14.అన్వర్ - తెర తీయనా...  √ 



మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

18, డిసెంబర్ 2009, శుక్రవారం

కనుక్కోండి చూద్దాం?


హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో వర్తమాన కథాకదంబం కథాజగత్ వెబ్‌సైటును ప్రచారం కలిగించడానికి ఒక బ్యానర్‌ను ప్రదర్శిస్తున్నాము. ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యానర్ ఏ స్టాలులో పెట్టబడిందో ఎవరైనా కనుక్కోగలరా?

17, డిసెంబర్ 2009, గురువారం

సాల్ గిరా...!

నేటితో నేను బ్లాగడం మొదలెట్టి ఏడాది పూర్తవుతుంది.
రేపు తురుపుముక్క రెండో సంవత్సరంలో అడుగిడబోతోంది.
ఈ సందర్భంగా వెనక్కి తిరిగి చూసుకుంటే...
వందకు మించిన టపాలు.
వాటిలో అంతో ఇంతో ఉపయోగ పడేవి, ఆసక్తి కలిగించేవి, ఆలోచింప చేసేవి ఒకటో అరో వుండి ఉండవచ్చు. 
మిగతావన్నీ నా మిడిమిడి జ్ఞానాన్ని, ఉత్తుత్తి పాండిత్యాన్ని, స్వంత పైత్యాన్ని ఎత్తి చూపించే టపాలే.
ఐతే ఈ యేడాదిలో కొన్ని వందల గంటల సేపు బ్లాగుల ప్రపంచంలో విహరించినాను.
నా సమయం వృథా కాలేదని ఘంటాపథంగా చెప్పగలను.
ఈ బ్లాగుల ద్వారా ఎంతోకొంత నేర్చుకున్నాను.
ఈ సందర్భంగా నా రాతలను ఓపికతో చదివిన పాఠకులు అందరికీ ధన్యవాదాలు.
లేఖిని అనే ఉపకరణం ద్వారా తెలుగులో నా ఆలోచనల్ని అంతర్జాలంలో పంచుకునే అవకాశం కల్పించిన వీవెన్ గారికి నా నెనర్లు.
ప్రత్యేకంగా నా టపాలపై కౌంటర్లు విసిరిన
ఒరెమూనా, భావకుడన్, సి.బి.రావు, కొత్తపాళీ, పూర్ణిమ, ఊకదంపుడు, వేదాంతం శ్రీపతి శర్మ, మల్లిక్, కస్తూరి మురళీకృష్ణ, వేదాంతం వెంకట సత్యవతి, చంద్రమోహన్, నేస్తం, చదువరి, భైరవభట్ల కామేశ్వర రావు, మలక్‌పేట రౌడీ, చింతా రామకృష్ణారావు, యోగి, ఆత్రేయ, రానారె, కంది శంకరయ్య, ఋషి, ప్రభాకర్ మందార, జయభారత్ సగిలి, చిలమకూరు విజయమోహన్, అమ్మ ఒడి, విహారి, పానీపూరి 123, వేమన, అరుణపప్పు, ధూం మచారా, భావన, అబ్రకదబ్ర, శరత్'కాలం', జీడిపప్పు, వంశీ ఎం.మాగంటి, కత్తి మహేష్ కుమార్, సుధ చిన్ని,ఎస్, బొల్లోజు బాబా, పునర్వసు, వినయ్ చక్రవర్తి గోగినేని, నాగసూరి, కల్పనా రెంటాల, రాం, PKMCT(ప్రవీణ్ శర్మ), ప్రవీణ్ ఖర్మ, అలీ,  సుభద్ర, స్వప్న@కలలప్రప్రంచం, జ్యోతి,
ఓం ప్రకాష్ నారాయణ వడ్డి, మారుతి, మాలాకుమార్,సృజనా రామానుజన్, కుమార్, రాణి, శ్రీలలిత, భవాని, కెక్యూబ్ వర్మ, రాజశేఖరుని విజయశర్మ,అజ్ఞాతలు, అనానిమస్‌లు మరియు తమ్ముడు ఫణి ప్రసన్న కుమార్ అందరికీ నా అభివాదాలు!


అంతే కాక నా అభిప్రాయాలను ప్రచురించిన
రాతలు - కోతలు, ఓంప్రకాష్ వర్క్స్, శ్రీపదములు, ఆంధ్రామృతం, తెలుగు తూలిక, జాజిమల్లి, డా.ఆచార్య ఫణీంద్ర,  వెంకటూన్స్, హాస్యం లాస్యం, రౌడీ రాజ్యం, పొద్దు స్లిప్పుల సర్వీసు, పొద్దు, పల్లవి అనుపల్లవిమంచికంటి, కలలప్రపంచం, రామాకనవేమిరా మొదలైన బ్లాగుల, వెబ్‌సైట్ల నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.


మరియు నా బ్లాగుకు ప్రచారం కల్పించిన కూడలి, జల్లెడ, హారం మొదలైన అగ్రిగేటర్ల యాజమాన్యానికి నా నమోవాకాలు.


నా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలద్వారా తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే వారినందరినీ క్షమించవలసినదిగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాతలు-కోతలు బ్లాగులో అభిమాని పేరుతో అచ్చుతప్పులను ఎత్తి చూపి కస్తూరి మురళీకృష్ణ గారిని ఇబ్బంది పెట్టినందుకు వారిని మన్నించమని వేడుతున్నాను.


మీ అందరి సహాయ ప్రోత్సాహాలు మున్ముందు ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాను.

12, డిసెంబర్ 2009, శనివారం

డా.రావూరి భరద్వాజ కథ!

ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారి కథానిక ఆహిరి కథాజగత్‌లో ప్రకటిస్తున్నాము. 1956కు పూర్వం వ్రాయబడ్డ ఈ కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను వెలువరించవలసినదిగా కోరుతున్నాము.

9, డిసెంబర్ 2009, బుధవారం

నవ్య వీక్లీలో బుడ్డా వెంగళరెడ్డిపై సమీక్ష!

నవ్య వీక్లీ 16-12-2009 సంచికలో బుక్‌చాట్ శీర్షికలో మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవలపై సుంకోజి దేవేంద్రాచారి సమీక్షించారు. తురుపుముక్క పాఠకుల కోసం ఆ సమీక్ష ఇక్కడ ఇస్తున్నాను.

5, డిసెంబర్ 2009, శనివారం

తెలంగాణా గోస!

"అవ్వా కోమట్ల యింటికాడ చెక్కా పల్క శేతికిచ్చినపుడు ముర్సుకుంట బడికి పోయిన. పది పాసైనపుడు పది మందికి చెప్పుక తిర్గితి. పై సదువులకు నేను వోతున్నపుడు తూట్లు పడ్డ టిక్కెట్లోలే సదువుకు తూట్లు వడొద్దు అనుకున్న. గని అన్ని నౌకర్ల అటెండర్లనుంచి అందరు ఆందరోల్లె నిండి పోతండ్రు. మనోల్లకు ఏమి యియ్యనిత్త లేరు. నేనేం జేయాలే" అని ఎల్లయ్య అన్నడు.
.......................................................
.......................................................
"ఔరా! తర్రగాడ్దికొడ్కు లెక్క యెన్కకు మర్రుతావురా. యీడ పుట్టినం. ఈడ పెరిగినం. ఈడ మలమల మాడుడు ఏందిరా. పొయి మనది. పొయి మీద కుండ మనది. పొమ్మనకుంట పొగవెట్టి యెల్లగొట్టాలె. గీయింత దానికే పోనని చెప్పుతండు మొగోడు. ఆ ఈని పిరికితనం సూడే...ఎట్లుందో..."
.......................................................
.......................................................
'ఔను నాయన...అవ్వ అన్నది నిజమే. పగదారునితో కొట్లాటకు వోయెటపుడు గెల్చి రావలె. అట్లా అని ఒక్కపారి ఓడిపోతె మొత్తం ఓడిపొయినట్లు ఎట్లయితది? కాదు. ఒక్కసారి ఫేలయినోల్లు నౌకరి చేసేటోల్లు లేరా...'
.......................................................
.......................................................
"మావోడు సదువాంటండు. ఏం సంగతి. ఇన్నొద్దులు మీ అయ్యవ్వ, మేం మంచిగ సదివిత్తర్రు అని పేరెల్లినం. మావోడు ఇగ సదువా అంటండు. ఏం జేయాల్నయా?" అంటూ ఎల్లయ్య దిక్కు చెయ్యి సూపెట్టుకుంట సెప్పుతండు రంగయ్య.

"నువ్వొద్దెనేనే మన నౌకర్లు మనగ్గాకుంట, మన నీళ్లు మనకు పారకుంట మన బొగ్గు మనకందకుండ మనకగ్గివెట్టిండ్రే...'పంట పండాలె గని తింటె దంగుతదా అన్నట్లు మంచి మంచి సదువులు కోస్తాంద్ర పంటలు దీసెటోల్లు సద్వించవట్టిరి. ఇగ మేమయితే మీరు పంపిచ్చిన పైసలు సాలక ఎస్టీడీలల్ల, క్యాటరింగ్...లాంటి ఎన్నో పనులు జేసుకుంట సద్వితిమి. వాళ్లకు మనకు పోటివెడ్తె ఐతదా...? గట్ల పెట్టి, మనదగ్గర కొలువులు కూడా ఏర్పడ కుంట గుంజుక పోతండ్రు. గట్ల నౌకరైనోడు పందికొక్కోలె వాని కిందికి, వానోని కిందికి పొక్క తోడుకుంటండు. మనకు నౌకర్లు రాకుంట చేత్తండ్రు" అని చెప్పిండు సత్తీస్.

"మన పని మనకు పంచెయ్యాలె. మన నౌకరి పాల్లు మనకు పెట్టాలె. పెట్టేటట్లు చెయ్యాలే" రంగయ్యన్నడు.

"అట్లు వొత్తలేదే? మాది మనోల్లది అనే ఆలోచన రాక మనం అట్ల తెలివికి రాక ఆగమైతన్నం" అని సత్తీస్ అన్నడు.

"ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే."
.......................................................
.......................................................
"ఔరా! మన తాడికి బతికెతందుకొచ్చి, మనది మనగ్గకుంట గుంజుకుంటే ఊకుండ వడ్తిమి. రేపు మన తమ్ముల్ది గుంజుకోరా...? వాంది. వానితాతది. వానయ్యది. మాయిముంత ఏడదాసిండ్రో గది వాని ఖుద్దుజాగ. మన దగ్గర్కొచ్చి మన యాస మీద, బాషమీద, పండుగలమీద వాని జుల్ము ఏంది? బిచ్చానికొచ్చినోడు ఆమిల్లు గరిస్నట్టు గావట్టే. నువ్వెమంటవ్రా ఎల్లా! చెప్రా"
.......................................................
.......................................................
"మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా...!" అని సత్తీస్ అన్నడు.

"ఔను! గీ ముచ్చట మంచిగుంది. థింక్ పాసిటివ్ వే గా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఐతది. ఒగ పెద్దయన 'నీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది' అన్నట్టు మనం జేసే పని మంచిదైతే అదే బాగైతది. మంచిగైతది" అని ఎల్లం అన్నడు.

"ఇగ రేపు వోదాం క్యాంపస్‌కు" సతీష్.
.......................................................
.......................................................
అవ్వా! రేపు పొద్దుగాల పట్నం బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా సదివెతందుకు.

నాయినా! ఇగ రేపు బోతా. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త.


సిద్దెంకి యాదగిరి గారి ఈ "కీలెరిగిన వాత" కథను పూర్తిగా కథాజగత్‌లో చదవండి.

28, నవంబర్ 2009, శనివారం

అంతర్ముఖం, మరో రెండు కథలు!

అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు?

అతడిని ఋషివర్యుడు ఎందుకు వారించాడు?

అతడి జీ(వి)తంపై ఎందరి బ్రతుకులు ఆధారపడి వున్నాయి?

ఋషివర్యుని జ్ఞానబోధ అతడిపై ఏమైనా ప్రభావం చూపిందా?

క్రమశిక్షణాలోపమే ఆత్మహత్యలకు కారణమా?

ఇంతకీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అడపా చిరంజీవి గారి డైరెక్టు కథ 'అంతర్ముఖం' కథాజగత్‌లో చదవండి. పనిలో పనిగా అరుణపప్పు గారి 'ఏకాంతంతో చివరిదాకా!', వడలి రాధాకృష్ణగారి 'కొలువు' కథలు కూడా చూడండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని మేము ఉబలాట పడుతున్నాము.

బక్రీద్ శుభాకాంక్షలు!!!


బ్లాగ్మిత్రులందరికీ ఈద్ ఉల్ జుహా పర్వదిన శుభాకాంక్షలు!!!

25, నవంబర్ 2009, బుధవారం

మిత్ర సమాగమము - చిత్ర మాలిక!

నవంబరు 14,15 తారీఖులలో కలిసిన మా మిత్ర బృందపు విశేషాలు ఈ క్రింది ఫోటోల్లో!
















23, నవంబర్ 2009, సోమవారం

ధిక్కార స్వరం!

శ్రీ పంతుల జోగారావుగారి కథానిక ధిక్కార స్వరం కథాజగత్ వెబ్‌సైట్‌లో చదవండి.
ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాము.

22, నవంబర్ 2009, ఆదివారం

బుడ్డా వెంగళరెడ్డి పై సమీక్ష!!!

మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన ఎస్.డి.వి అజీజ్ గారి చారిత్రక నవల బుడ్డా వెంగళ రెడ్డి పై 22-11-2009 ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో పాలంకి సత్యనారాయణ గారు సమీక్షించారు.
ఇక్కడ చదవండి.


20, నవంబర్ 2009, శుక్రవారం

వస్తున్నాయొస్తున్నాయి...

వర్తమాన తెలుగు కథానికా కదంబం కథాజగత్‌లో త్వరలో వెలువడనున్న కథల వివరాలు.

1.అడపా చిరంజీవి - అంతర్ముఖం √

2.యర్రమిల్లి విజయలక్ష్మి - అమ్మ చెట్టు √

3.వడలి రాధాకృష్ణ - కొలువు √

4.రావూరి భరధ్వాజ - ఆహిరి √

5.శ్రీరాగి - కుడి ఎడమైతే √

6.వియోగి- వసంత కోకిల √

7.విశాల వియోగి - శృతిలేని రాగం √

8.రమ్య - రాంగు సుబ్బారావు √

9.కోడూరి శ్రీరామమూర్తి - తెరతీయగరాదా... √

10.సిద్దెంకి యాదగిరి - కీలెర్గిన వాత √


మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

17, నవంబర్ 2009, మంగళవారం

బాల్యమిత్రుల అపురూప సమ్మేళనం!!!

ఈ నవంబర్ 14, 15 తారీఖుల్లో మా చిన్ననాటి స్నేహితులం అందరం హైదరాబాదులో కలిశాం. గుత్తిలో మాల్టస్‌స్మిత్ జూనియర్ కళాశాలలో తొమ్మిది, పది తరగతులు మేమందరం కలిసి చదివినాము. ఇరవైతొమ్మిదేళ్ళ నాటి ముచ్చట అది. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ రెండు రోజులూ సరదాగా గడిపాము.

మంజునాథ సెట్టి, గంగవరం సత్యనారాయణ, మురళీకృష్ణ, జగదీష్, జగన్నాథం, గోవర్ధన గిరిధరరెడ్డి, ఇనాయతుల్లా, బషీర్, రఫీక్, వెంకటేష్, కేశవచంద్ర, చంద్రశేఖరరెడ్డి(బాబు), బాలరాజు, రఘునందన్, ఇసాక్, మోహన్‌రావ్, ఫయాజ్, నజీర్, పి.రమేష్, నాగేశ్వరరెడ్డి, నేను ఈ సమాగమంలో వున్నాము. గుత్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, గుంతకల్లు, హైదరాబాదు, గదగ్, గోదావరిఖని, హిందూపురం ఇలా వివిధ ప్రాంతాలనుండి వచ్చాము. మాలో కొందరు టీచర్లు, కొందరు లాయర్లు, కొందరు వ్యాపారస్తులు, ఒకడు లెక్చరర్, మరొకడు ప్రొఫెసర్. ఒకడు ప్రొడక్షన్ మేనేజర్, ఒకడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఒకడు ఇండస్ట్రియలిస్ట్. ఒకడు ఆర్కిటెక్ట్. మరొకడు రాజకీయ నాయకుడు ఇలా అన్ని రకాల జీవన పథగాములము ఉన్నాము. మాలో ఒకడు తరచూ విదేశాలకు వెళ్తూ ఉంటాడు. ఒకడైతే మొదటిసారి హైదరాబాదు చూశాడు. ఇలా భిన్న జీవన విధానాలు కలిగిన మమ్మలనందరినీ కలిపింది ఒక్కటే. అదే స్నేహం. సంఘం కప్పిన ముసుగులను తొలగించుకుని మేము అందరం అరే ఒరే అంటూ ఎటువంటి భేషజాలూ లేకుండా ఈ రెండు రోజులూ గడిపాము.

14వ తేదీ ఉదయం 6 గంటలకు హోటల్ అతిథి ఇన్‌లో మా మిత్రులకు స్వాగతం పలికాము నేనూ, సత్య. అందరూ గుత్తి నుండి ఒక మినీ బస్సులో వచ్చారు. పలకరించడాలూ, గుర్తించడాలూ (కొందరిని చాలా ఏళ్ళ తరువాత మొదటి సారి కలిశాం) అన్నీ అయిన తరువాత అందరం రూముల్లో సెటిలై స్నానాలు ముగించుకుని తయ్యారయ్యాము. హోటల్ టెర్రేస్ పైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాము. ఈ లోగా మోహన్‌రావూ, మురళీకృష్ణా మాతో జాయిన్ అయ్యారు. అందరం అదే మినీ బస్సులో గోల్కొండకు వెళ్ళాము. నలభై దాటిన మేమందరం పడుచు యువకుల్లా హుషారుగా జోకులేసుకుంటూ గోల్కొండ కోటను దర్శించాము. సుమారు రెండు గంటలు గోల్కొండలో గడిపిన తర్వాత కుతుబ్ షాహీ టూంబ్స్ చూశాము. గుత్తిలో జీవించిన వాళ్ళము కొండలూ, గోరీలు మాకు కొత్త కాకపోయినప్పటికీ గోల్కొండ పురాతన వైభవం మామిత్రులను ఆకర్షించింది. తర్వాత మధ్యాహ్నం పూర్ణ హోటల్లో భోజనాలు ముగించుకుని స్నోవరల్డ్ వైపు దారి తీశాము. స్నోవరల్డ్ లో మేమంతా చిన్న పిల్లల్లా మారిపోయాము. ఓ గంట సేపు మా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత అక్కడి నుండి బిర్లా మందిర్‌కు వెళ్ళాము. కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో బిర్లా మందిర్ రద్దీగా ఉంది. బాలాజీ దర్శనం చేసుకుని కోఠీలో కొందరు షాపింగ్ చేసి రాత్రి పదకొండు గంటలకు మా హోటల్ చేరుకున్నాము. ముందుగానే ఆర్డర్ ఇచ్చిన మెనూ ప్రకారం హోటల్ డాబాపై మా అందరికీ ఫుడ్ సర్వ్ చేయబడింది. కొందరు వెజిటేరియన్లు. మరికొందరు శనివారం కాబట్టి వెజిటేరియన్లు. మిగతా వారందరూ ఎన్.వీలు. కొందరు లిక్కర్ తీసుకున్నారు. షరా మామూలుగానే శనివారం కాబట్టి కొందరు మందుకు దూరంగా ఉండి మా గ్రూపులో కలిశారు. వోడ్కా, 12యేళ్ళ పాతదైన షివాస్ రీగల్ వాళ్ళు సేవించింది. తాగిన మైకంలో మా మిత్రులు చేసిన అల్లరి భరిస్తూ రాత్రి ఒంటిగంటవరకు మేలుకున్నాము.

మరుసటి రోజు ఉదయమే గదగ్ నుండి రమేష్, కర్నూలు నుండి రఘు వచ్చారు. అందరం తయ్యారయ్యేసరికి తొమ్మిది గంటలు దాటింది. అన్నీ సర్దుకుని హోటల్ వెకేట్ చేసి పక్కనే ఉన్న కామత్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీలో మేము చూసినవి మూవీ మాజిక్, ఫిల్మీ దునియా, స్టంట్ షో, ఫన్ షో, స్పిరిట్ ఆఫ్ రామోజి ఫిల్మ్ సిటీ, బోరాసుర వగైరా. అక్కడ అన్నింటి కన్నా మమ్మల్ని బాగా అలరించింది రేంజర్ అనే కాంప్లిమెంటరీ రైడర్. దీన్లో మేము సవ్య దిశలో రెండు చక్కర్లు, అపసవ్య దిశలో రెండు చక్కర్లు కొడతాము. ఆకాశంలో పూర్తి తలక్రిందలుగా కొన్ని సెకెన్లు అలాగే ఉంటాము. అప్పుడు వేసే భయానికి నోరు కూడా పెగలదు. జీవితంలో ఇలాంటి అనుభవం ఒకసారైనా ఉండితీరాలి. సాయంత్రం ఆరుగంటల దాకా రామోజీ ఫిల్మ్ సిటీలో గడిపి అక్కడి నుండి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఒక ఎక్జిబిషన్‌కు వెళ్ళాము. అక్కడి రష్షులో ఎవరికీ షాపింగ్ చేయడానికి వీలు పడలేదు. మా ప్రమేయం లేకుండానే లోపలికి త్రోయబడి మా ప్రమేయం లేకుండానే బయటకు నెట్టివేయబడ్డాము. ఇక మేము విడిపోయే సమయం ఆసన్నమయింది. అందరం ఒకరికొకరు థాంక్స్ చెప్పుకున్నాము. వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి మేం మా యిళ్ళకి వెళ్ళిపోయాము. కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు మినహాయిస్తే మా పార్టీ విజయవంతమయ్యిందనే చెప్పాలి. ఈ పార్టీ తాలూకు ఫోటోలు త్వరలోనే మరో టపాలో మీముందు ఉంచుతాను.

13, నవంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం!

కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించు చుండును
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.


ఇదెలా సాధ్యమో ఎవరైనా వివరించ గలరా!

3, నవంబర్ 2009, మంగళవారం

బుడ్డా వెంగళరెడ్డి


ఎస్.డి.వి.అజీజ్ రచించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవల మా సంస్థ తరఫున ప్రచురించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆ పుస్తకం హైదరాబాదులోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో అంటే విశాలాంధ్ర, నవోదయ, తెలుగుబుక్ హౌస్, దిశపుస్తకకెంద్రం, ప్రజాశక్తి, సహచర బుక్‌మార్క్,సాహిత్యనికేతన్, ఆంధ్ర సారస్వత పరిషత్ మొదలైన చోట్ల లభిస్తుంది. ఆంధ్ర దేశంలో ఉన్న విశాలాంధ్ర, ప్రజాశక్తి వారి బ్రాంచీలలో కూడా లభ్యమవుతుంది. విదేశాలలో ఉన్న వారు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయదలిస్తే ఎ.వి.కె.ఎఫ్. వారి బుక్ లింక్‌ను చూడండి. వెల కేవలం యాభై రూపాయలు మాత్రమే కాబట్టి వీలున్న వారు ఈ పుస్తకాన్ని కొని చదవమని నా విన్నపం.

2, నవంబర్ 2009, సోమవారం

పరాకు మానిసి!

ఒక పదాన్ని గానీ పదబంధాన్ని గానీ వెనుకనుండి చదివినా ముందునుండి చదివినా ఒకేలా ఉంటే దానిని ఇంగ్లీషులో palindrome అని అంటారు. ఉదా:- కిటికి, వికటకవి, మందారదామం వగైరా. ఇలాంటి palindromeతో కూడిన ఒక సంభాషణను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. దీనిని శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల మధ్య నడిచిన సంభాషణగా ఊహించి ఎంత చక్కగా అల్లారో చూడండి.

కృ.శా. : రారా శ్రీశ్రీ రారా!
శ్రీశ్రీ : యాటికిరా కిటియా!
కృ.శా. : సినిమాకురా పరాకు మానిసి!
శ్రీశ్రీ : రాలేనులేరా!


సరదాగా గమ్మత్తుగా లేదూ!

1, నవంబర్ 2009, ఆదివారం

కథాజగత్‌లో మరో రెండు కథలు!

వర్తమాన కథా కదంబం ఆధునిక తెలుగు కథానిక శత వార్షికోత్సవాల కానుక కథాజగత్ వెబ్‌సైటులో కొత్తగా రెండు కథలు చేరాయి. మొదటిది స్వాతి శ్రీపాద రచించిన ఎర అనే కథ. రెండవది డా.టీ.సంపత్‌కుమార్ వ్రాసిన మSheన్ అనే కథ. వీటిల్లో ఎర డైరెక్టు కథ కాగా మsheన్ స్త్రీవాద పత్రిక భూమికలో ఆగస్టు 2008లో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

25, అక్టోబర్ 2009, ఆదివారం

భరాగో కథ!

ప్రసిద్ధ కథా రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి కలం నుండి వెలువడిన 'నుపకారికి నపకారము!' అనే కథను తెలుగు కథల శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథా కదంబం "కథాజగత్‌"లో చదవండి.

అతి త్వరలో ఈ క్రింది కథలు కూడా కథాజగత్‌లో ప్రకటింప బడతాయి.

1.రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి

2.గృహ హింస - ఆచార్య కొలకలూరి ఇనాక్

3.హామీ...!! - ఎ.వి.యం

4.రెండు లోకాలు - డా. వేదగిరి రాంబాబు

5. బొమ్మలు - డా.బోయ జంగయ్య.

తప్పక చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

19, అక్టోబర్ 2009, సోమవారం

నాకు తెలిసిన బాలగోపాల్



ఇదే శీర్షికతో అంకురం బ్లాగులో శరత్‌చంద్ర వ్రాసిన టపా చూసిన తరువాత నాకు కూడా బాలగోపాల్ గురించి వ్రాయడానికి కాస్త ధైర్యం వచ్చింది. నా జీవితంలో బాలగోపాల్ గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం రెండు సార్లు కలిగింది. నేను అనంతపురంలో డిప్లొమా చదివే రోజుల్లో మొదటి సారి బాలగోపాల్‌ను చూశాను. లలిత కళా పరిషత్ పక్క సందులో ఉండే గిల్డ్ ఆఫ్ టీచర్స్ స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ రామనాథం సంతాప సభలో బాలగోపాల్ ప్రసంగం విన్నాను. ముందు వరసలో కూర్చుని(ఆ సభకు కార్యకర్తలు మినహా ఎక్కువ మంది హాజరు కాలేదు) అతి దగ్గరనుండి బాలగోపాల్‌ను చూసే అవకాశం కలిగింది. ఆ సభ విశేషాలు నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ చాలా వేగంగా ఉద్రేకపూర్వకంగా సాగిన బాలగోపాల్ ప్రసంగం నాకు ఇప్పటికీ మనసులో మెదులుతోంది. బహుశా అప్పటికి ఇంకా అతను ఎ.పి.సి.ఎల్.సి.లో ముఖ్యమైన బాధ్యతను చేపట్టలేదనుకుంటా. ఆ రోజు నుండి నాకు తెలియకుండానే బాలగోపాల్ ప్రభావం నాపై పడింది. తరువాత అప్పుడప్పుడూ పత్రికలలో బాలగోపాల్ గురించి, పౌర హక్కుల గురించి వార్తలు చదివే వాడిని. ఎ.పి.సి.ఎల్.సి.కి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడని వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. అతనో అన్‌సంగ్ హీరోగా నామనసులో వుండిపోయాడు. రెండోసారి బాలగోపాల్‌ను నేను కలిసింది ఆర్.టీ.సీ బస్సులో. అదీ అతని పక్క సీటులో కూర్చుని కలిసి ప్రయాణించే అదృష్టం కలిగింది. నేను హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్నాను. కాస్సేపటి తర్వాత బాలగొపాల్ బస్సు ఎక్కి నా పక్కన ఉన్న విండో సైడు సీటు వద్దకు వచ్చాడు. పొట్టి చేతుల కాటన్ చొక్కా వేసుకుని ఉన్నాడు. భుజాన ఒక గుడ్డ సంచి మరో చేతిలో పోస్టర్లు చుట్టి ఉన్న కట్ట పట్టుకుని అతి సాధారణంగా వస్తున్న బాలగోపాల్‌ను చూసి ఆశ్చర్యపోయాను. లేచి అతనికి దారి వదలి అతను తన సీటులో కూర్చోగానే నా సీటులో నేను కూర్చున్నాను. సంకోచంతో కూడిన ఉద్వేగం వల్లనో మరే కారణం చేతో నేను బాలగోపాల్‌ను పలకరించే సాహసం చేయలేకపోయాను. అతను కూడా నా వైపు ఒక చూపు చూసి తన పనిలో తాను మునిగిపోయాడు. మరుసటిరోజు తాను పాల్గొనే సభగురించి ఆలోచించుకుంటూ ఉండివుంటాడు. ఆరోజు అతన్ని పలకరించి పరిచయం చేసుకోక పోవడం నేను చేసిన తప్పుగా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. తరువాత బాలగోపాల్ కడపలో బస్సు దిగిపోయాడు. తరువాత అడపాదడపా టీ.వీ.చానళ్ళలో చర్చలలో అతడిని చూడటం, అతడు రాసిన వ్యాసాల్లో ఒకటో రెండో చదవడం మినహా బాలగోపాల్ గురించి నాకు తెలిసింది శూన్యమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే బాలగోపాల్ గురించి ఆయన మరణించిన తరువాతనే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. తాడిత పీడిత అణగారిన వర్గాల తరఫున ఆయన నిత్యం న్యాయం కోసం హైకోర్టులో అలుపెరుగని పోరాటం చేసేవాడనీ, మానవ హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షమై తన గొంతుకను విప్పేవాడనీ, కేవలం మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కాశ్మీర్, బీహార్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో కూడా మానవ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడనీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సాధికారమైన వ్యాసాల పరంపరను వెలువరించాడనీ, డి.డి.కోశాంబిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశాడనీ ఇంకా ఎన్నో విషయాలు ఆయన మరణించిన తర్వాతే తెలిసింది. 12వ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంతాప సభలో బాలగోపాల్ నాకు పూర్తిగా అవగాహనకు వచ్చాడు. బాలగోపాల్ సమకాలీకుడినని చెప్పుకునేందుకు ఇప్పుడు నేను గర్విస్తున్నాను.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు!!!




బ్లాగ్మిత్రులందరికీ ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళిఅమావాస్య, బలిపాడ్యమి పర్వదినాల సందర్భంగా నా హార్థిక శుభకామనలు.

15, అక్టోబర్ 2009, గురువారం

పొలిటీషనోపాఖ్యానం!!!

రాముడు సీతాన్వేషణలో సహాయపడిన జటాయువుకు ఇచ్చిన వరమేమిటి? రామరావణ యుద్ధానంతరం జరిగిన విజయోత్సవ సభలో పక్షులు ఎందుకు గొడవ చేశాయి? పక్షులను రెండవసారి ఏమి చెప్పి ఊరించాడు శ్రీరాముడు? శ్రీకృష్ణుని ఎదుట పక్షి సమూహం ఎందుకు స్ట్రైక్ చేసింది? జటాయువు ఇచ్చిన వరాన్ని నెరవేర్చేందుకు రామునికి రెండు యుగాల సమయం ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలని ఉందా? అయితే కథాజగత్‌లో వచ్చిన కథ వరదానం చదవండి.

14, అక్టోబర్ 2009, బుధవారం

సర్కస్ సర్కస్ - చివరి భాగం!

ఇంతవరకూ కొన్ని సర్కస్ వీడియో క్లిప్పింగులు చూశారుకదా! ఇప్పుడు మిగతా క్లిప్పింగులు కూడా చూడండి.
చివరి వీడియో క్లిప్పింగు మాత్రం పడుకుని చూడండి. వీలు కాకపోతే కనీసం మీ మానిటర్‌ను పడుకోబెట్టండి.





13, అక్టోబర్ 2009, మంగళవారం

సర్కస్ సర్కస్ - 2వ భాగం!

మేము చూసిన సర్కస్ తాలూకు మరికొన్ని ఫీట్లు మీరూ చూసి ఆనందించండి.







మరికొన్ని విన్యాసాలు మరో టపాలో!

12, అక్టోబర్ 2009, సోమవారం

క్షమాపణల బాటలో మరో మేధావి!

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి పై పాట రాయడమనే తప్పిదానికి భాద్యత వహిస్తూ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రజా ఉద్యమానికీ, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు ఈ రోజు పేపర్లో వార్త కనిపించింది. మానసిక స్థితి బాగాలేకపోవడం వల్ల, వయసు పైబడడంతో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై పాట కట్టాడట! ఇంతకు ముందు వి.ర.సం. నేత ఎన్.వేణుగోపాల్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి తో తనకుగల అనుబంధాన్ని తెలుపుతూ వ్రాసిన వ్యాసం దుమారాన్ని రేపటం, పర్యవసానంగా ఆయన్ని విరసం నుండి బహిష్కరించటం, ఆ పిమ్మట ఆయన క్షమాపణలు చెప్పటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలో వంగపండు... నిజంగా వీరు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారా? అలా అయితే ఫరవాలేదు కానీ ఒత్తిడితో ఆ పని చేస్తే వారికి నా సానుభూతి. తాము నమ్మింది తప్పో ఒప్పో దానికే జీవితాంతం ధైర్యంగా కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది కానీ తతిమ్మా వాళ్ళని కాదు.

11, అక్టోబర్ 2009, ఆదివారం

ఎంపైర్ సర్కస్

ఈ రోజు మా శ్రీమతి, పిల్లలతో కలిసి సర్కస్‌కు వెళ్ళాను. రెండున్నర గంటలసేపు రొటీన్ జీవితం నుండి కాస్త ఆటవిడుపు. మా అబ్బాయి ప్రమోద్ ఈ సర్కస్ విన్యాసాలని తన మొబైల్ ఫోన్‌లో కాప్చర్ చేశాడు. వాడి పుట్టిన రోజు బహుమతిగా ఈ మధ్యే ఒక సెల్‌ఫోన్ కొనిచ్చా. కొత్త ఫోను మోజులో వీడియో తీశాడు. మీరూ చూసి ఆనందించండి.




మిగతా విన్యాసాలు మరో టపాలో.

4, అక్టోబర్ 2009, ఆదివారం

ఇప్పుడు కథాజగత్ వెబ్‌సైట్ రూపంలో!!!

కథాజగత్ పేరుతో నేను నడుపుతున్న బ్లాగు గురించి తురుపుముక్క పాఠకులకు తెలుసు. ఆ బ్లాగులో వస్తున్న కథల వివరాలు ఎప్పటికప్పుడు తురుపుముక్కలో తెలియజేస్తున్న సంగతి విదితమే. ఈ కథాజగత్ బ్లాగులో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు దానిని పూర్తిస్థాయి వెబ్‌సైటుగా మార్చాను. ఇప్పుడు కథాజగత్‌ను ఈ చిరునామాలో దర్శించవచ్చు. http://www.kathajagat.com

ఈ వెబ్‌సైటును ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవిగారు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాదు లోని బాగ్‌లింగంపల్లి లోని వారి ఇంట్లో ఈ రోజు అంటే 04-10-2009న సాయంత్రం 4.30గంటలకు ఈ వెబ్‌సైటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మిత్రులు కొల్లూరి సోమశంకర్, తంగిరాల చక్రవర్తి, గురజాడ అప్పారావు, సత్య భాస్కర్, జి.ఎస్.రామకృష్ణ, వూసల రజనీ గంగాధర్ పాల్గొన్నారు. ఆ సమావేశం తాలూకు ఫోటోలు కొన్ని.















2, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! - సమాధానాలు

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! పేరుతో ఇంతకు ముందు ఇచ్చిన పజిల్ సొల్యూషన్ ఇక్కడ ఇస్తున్నాను.



సమాధానాలు:
అడ్డం :
1.ఏకాకి కథా రచయిత(6) -అచ్యుతరామయ్య
4.వింజమూరి వారి కథలో ఇంటావిడ పేరు వయసులో ఉన్నప్పుడా?(3) - జానకి
6.దింపుడు కళ్ళం రచయిత కలగాపులగం అయ్యాడు (6) -ద్రచంరారావుమ
10.సుందరం తన కూతుర్ని ఈ అంశంలో చాంపియన్ చేయాలని ఆశించాడు పాపం!(2) -ఈత
11.దింపుడు కళ్ళం కథలో నాన్న ఇంటికి తెచ్చింది ఈవిడ్నే!(2) -నర్సు
12.యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే ____ పెడుతుంటే. నిజంగా ఒకటే!(3) -సోకండం
13.వైదేహి మనుమరాలు, మానస కూతురూను (3) -శ్రీలత
15.రాబోయే ప్రమాదం నుండి ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌ను కాపాడాలని పాపం ఈ గ్యాంగ్‌మ్యాన్ తడబడ్డాడు(3) -రాయ్యమ
17.సూపర్‌వైజర్‌ని చూడగానే ఈ గేట్‌మాన్ విష్ చేశాడు అటునుంచి?!(4) -య్యరమకొ
21.చిన్ని చిన్ని ఆశ కథకుడు (4) -దిలావర్
23.బుడ్డ రాకాసి తల్లి కాబట్టే తడబడింది(4) -త్యాయికాని
24.అటునుంచి ఏకాకి హీరో (4) -థ్‌నామరా
25.కథా రచయిత ఈశ్వర్ ఇంటిపేరు?(4) -కోలపల్లి
28.రాధేయ గారి కథ తడబడటంతో ఒక అక్షరానికున్న సున్న మరో అక్షరానికి తగులుకుంది(4) -సంమౌనహి
30.నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు ___, తమలపాకు ___, క్యాబేజీ ___, ఉల్లి ___ ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది(3) -పకోడి
32.నిలువు 4.రచయిత ఈ యేడాది ___శాంతి పురస్కారం మరో రచయితతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వెనుక నుండి చదవండి(3) -లామవి
34.ఆకులేని అడవి అని దీన్ని వర్ణిస్తున్నారు ఓ కథకుడు(3) -సముద్రం
37.రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద __ __గా దాడి!రెండు సార్లు చెప్పనక్కర లేదు(2) -కసి
38."__ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ (2) -హాయ్
40. కొందరు మాత్రమే ఏపరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే ______ అంటాం. కానీ పాపం చెల్లాచదురయ్యారు(6) -రుమహాపులురు
41.ఈ తిలకం పెట్టుకుంటాడో లేదో తెలియదు కాని పేరుముందు మాత్రం ఉంటుంది మన మురళీకృష్ణకి(3) -కస్తూరి
42.వానరాయుడి అసలు సిసలు పేరు? -కాటమరాయుడు

నిలువు:
1.మృదుల తండ్రి, రాఘవకు మామయ్య కాలేక పోయాడు?(4) -అనంతయ్య
2.సునీత నానిగాడి __?(2) -తల్లి
3.తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. ఈ పదానికి పర్యాయ పదం(3) -మమైకం
4.అడ్డం 34 రచయితే!(3) -జాతశ్రీ
5.అతనికి తల నరికి మధ్యలో గుడిలేకున్నా అర్థం మారదు కానీ తలక్రిందలయ్యింది(3) -కినత
7.మానస వీణ రచయిత ఇంటిపేరు లేకుండా? ఐతే నేం?(3) -చంద్రయ్య
8.పడమటి దేశానికి __ హిరణ్యుడు(2) -రాజు
9.మానస మానసచోరుడు?(4),
12.సోమశంకర్ కొల్లూరిని ఇలా పొట్టిగా పిలవచ్చా?(2) -సో.కొ.
14.హసీనాను సమ్మోహితురాల్ని చేసిన నర్తకి(2) -లక్ష్మి
16.ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు.ఈ పదానికి పర్యాయ పదం!(2) -మది
18.ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రక___ చేపలు!(3) -రకాల
19.ఇందిరాదేవిగారి కథలో పాత్రలు ప్రయాణించింది ఈ ఎక్స్‌ప్రెస్‌లో?(3) -బొకారొ
20.అజీజ్‌గారి కథలో హీరోయిన్?(3) -మీనాక్షి
22.మధుకర్ భారతిని ఇలా సంభోధిస్తాడు కానీ హ్రస్వంగా...(3) -వదిన
25. ఇంటికి ____, పొరుక్కి శివాలక్ష్మి.కానీ అటూఇటూ అయ్యింది(4) -కోదెష్టారు
26. తలక్రిందలైన గంగాధర్ ఇంటిపేర్లో లేనివేం?(2) -ల్లిప
27."అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ __నవమికి పందిరేస్తున్నా.."అరిపిరాల సత్యప్రసాద్ కథలో ఒక డైలాగు(2) -రామ
28.ముప్పైనాలుగు అడ్డమే పొట్టిగా(2) -సంద్రం
29.పశ్చిమ దేశానికి రాజు____(4) -హిరణ్యుడు
31.నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది... ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య. ఇద్దరివీ కలిపి(3) -కోపాలు
32.స్వరహీనమైన బహుమానం రచయిత!(3) -లాసిక
33.ఈ కలం పేరుగల ఇద్దరి కథలు కథాజగత్‌లో ఉన్నాయి(3) -విహారి
35. ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ___లై గోదాట్లో పారుతుంటాయ్(3) -ముప్పేట
36.తోక తెగిన 33నిలువు రచయిత? -విహా
39.ఓంప్రకాశ్ కథ పేరులో చివరి రెండక్షరాలు(2) -దురా

సరియైన సమాధానాలు ఎవరూ వ్రాయలేకపోయారు. కేవలం అమంతాగారు మాత్రం కొంత ప్రయత్నించారు. వారికి నా అభినందనలు. త్వరలో మరో క్రాస్‌వర్డ్ పజిల్‌తో మీముందుకు వస్తాను.

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

బుడ్డా వెంగళరెడ్డి పుస్తకావిష్కరణ!!!

మా అబ్జ క్రియేషన్స్ తరఫున నాల్గవ ప్రచురణగా వెలువరించిన శ్రీ ఎస్.డి.వి.అజీజ్ గారి చారిత్రక నవల 'బుడ్డా వెంగళరెడ్డి' గ్రంథాన్ని ప్రముఖ కవి శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు ఆవిష్కరించారు. తెలుగుభాషా వైభవ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రవితేజమ్ దినపత్రిక కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆవిష్కర్త శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తిగారు మాట్లాడుతూ మానవతావాది బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రను నవలా రూపంలో పాఠకులకు పరిచయం చేసిన రచయిత అజీజ్ గారిని అభినందించారు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కోడీహళ్లి మురళీమోహన్ మాట్లాడుతూ ఆకస్మికంగా దసరా కానుకగా ఈ ఆవిష్కరణను ఏర్పాటు చేసినందువలన గ్రంథ రచయిత శ్రీ అజీజ్‌గారు హాజరు కాలేక పోయారనీ త్వరలో ఇదే పుస్తకాన్ని కర్నూలు, ఆళ్ళగడ్డ పట్టణాలలో ఘనంగా ఆవిష్కరించ నున్నామని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో రవితేజం సంపాదకులు శ్రీ భూపతి రవీంద్రనాథ్, సాహిత్యకిరణం పత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, సాహితీ వేత్తలు శ్రీ గురజాడ అప్పారావు, శ్రీమతి గురజాడ విజయశ్రీ, శ్రీ ఎస్.వివేకానంద, శ్రీ టి.గోపాలరావు, శ్రీ గుంటూరు శివరామకృష్ణ, శ్రీ కె.రామకృష్ణ, శ్రీ ఎ.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆ సమావేశానికి చెందిన ఫోటోలు కొన్ని .







26, సెప్టెంబర్ 2009, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! - కొన్ని హింట్స్

పజిల్ పూరించటానికి ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు. బహుశా ఇచ్చిన ఆధారాలకు మరో బ్లాగు(కథాజగత్)కు వెళ్ళి ఆ కథలను చదివి సమాధానం తెలుసుకునేందుకు కొంచెం కష్టంగా ఉన్నట్లు తోస్తున్నది. సరే ఈ ఆధారాలకు సంబంధించిన లింకులను ఇస్తున్నాను. ఎవరైనా పూరించగలరేమో చూద్దాం. మీ పూరణలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబరు 30. బెస్ట్ఆఫ్‌లక్!




ఆధారాలు:

అడ్డం :
1.ఏకాకి కథా రచయిత(6),
4.వింజమూరి వారి కథలో ఇంటావిడ పేరు వయసులో ఉన్నప్పుడా?(3),
6.దింపుడు కళ్ళం రచయిత కలగాపులగం అయ్యాడు (6),
10.సుందరం తన కూతుర్ని ఈ అంశంలో చాంపియన్ చేయాలని ఆశించాడు పాపం!(2),
11.దింపుడు కళ్ళం కథలో నాన్న ఇంటికి తెచ్చింది ఈవిడ్నే!(2),
12.యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే ____ పెడుతుంటే. నిజంగా ఒకటే!(3),
13.వైదేహి మనుమరాలు, మానస కూతురూను (3),
15.రాబోయే ప్రమాదం నుండి ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌ను కాపాడాలని పాపం ఈ గ్యాంగ్‌మ్యాన్ తడబడ్డాడు(3),
17.సూపర్‌వైజర్‌ని చూడగానే ఈ గేట్‌మాన్ విష్ చేశాడు అటునుంచి?!(4),
21.చిన్ని చిన్ని ఆశ కథకుడు (4),
23.బుడ్డ రాకాసి తల్లి కాబట్టే తడబడింది(4),
24.అటునుంచి ఏకాకి హీరో (4),
25.కథా రచయిత ఈశ్వర్ ఇంటిపేరు?(4),
28.రాధేయ గారి కథ తడబడటంతో ఒక అక్షరానికున్న సున్న మరో అక్షరానికి తగులుకుంది(4),
30.నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు ___, తమలపాకు ___, క్యాబేజీ ___, ఉల్లి ___ ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది(3),
32.నిలువు 4.రచయిత ఈ యేడాది ___శాంతి పురస్కారం మరో రచయితతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వెనుక నుండి చదవండి(3),
34.ఆకులేని అడవి అని దీన్ని వర్ణిస్తున్నారు ఓ కథకుడు(3),
37.రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద __ __గా దాడి!రెండు సార్లు చెప్పనక్కర లేదు(2),
38."__ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ (2),
40. కొందరు మాత్రమే ఏపరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే ______ అంటాం. కానీ పాపం చెల్లాచదురయ్యారు(6),
41.ఈ తిలకం పెట్టుకుంటాడో లేదో తెలియదు కాని పేరుముందు మాత్రం ఉంటుంది మన మురళీకృష్ణకి(3),
42.వానరాయుడి అసలు సిసలు పేరు?

నిలువు:
1.మృదుల తండ్రి, రాఘవకు మామయ్య కాలేక పోయాడు?(4),
2.సునీత నానిగాడి __?(2),
3.తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. ఈ పదానికి పర్యాయ పదం(3),
4.అడ్డం 34 రచయితే!(3),
5.అతనికి తల నరికి మధ్యలో గుడిలేకున్నా అర్థం మారదు కానీ తలక్రిందలయ్యింది(3),
7.మానస వీణ రచయిత ఇంటిపేరు లేకుండా? ఐతే నేం?(3),
8.పడమటి దేశానికి __ హిరణ్యుడు(2) చూడుము నిలువు 29.,
9.మానస మానసచోరుడు?(4),
12.సోమశంకర్ కొల్లూరిని ఇలా పొట్టిగా పిలవచ్చా?(2),
14.హసీనాను సమ్మోహితురాల్ని చేసిన నర్తకి(2),
16.ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు.ఈ పదానికి పర్యాయ పదం!(2),
18.ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రక___ చేపలు!(3),
19.ఇందిరాదేవిగారి కథలో పాత్రలు ప్రయాణించింది ఈ ఎక్స్‌ప్రెస్‌లో?(3),
20.అజీజ్‌గారి కథలో హీరోయిన్?(3),
22.మధుకర్ భారతిని ఇలా సంభోధిస్తాడు కానీ హ్రస్వంగా...(3),
25. ఇంటికి ____, పొరుక్కి శివాలక్ష్మి.కానీ అటూఇటూ అయ్యింది(4),
26. తలక్రిందలైన గంగాధర్ ఇంటిపేర్లో లేనివేం?(2),
27."అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ __నవమికి పందిరేస్తున్నా.."అరిపిరాల సత్యప్రసాద్ కథలో ఒక డైలాగు(2),
28.ముప్పైనాలుగు అడ్డమే పొట్టిగా(2),
29.పశ్చిమ దేశానికి రాజు____(4)చూడుము నిలువు 8.,
31.నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది... ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య. ఇద్దరివీ కలిపి(3),
32.స్వరహీనమైన బహుమానం రచయిత!(3),
33.ఈ కలం పేరుగల ఇద్దరి కథలు కథాజగత్‌లో ఉన్నాయి(3),
35. ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ___లై గోదాట్లో పారుతుంటాయ్(3),
36.తోక తెగిన 33నిలువు రచయిత?,
39.ఓంప్రకాశ్ కథ పేరులో చివరి రెండక్షరాలు(2).

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

కాస్త మోదం - కాస్త ఖేదం

మహమ్మారి స్వైన్‌ఫ్లూ విజృంభణ సంగతి అలా ఉంచితే మీడియాలో ఈ వ్యాధికి సంబంధించిన ప్రచారం మాత్రం విపరీతంగా ఉంది. ఏ పేపర్ చదివినా, ఏ న్యూస్ చానల్ చూసినా స్వైన్‌ఫ్లూకు చెందిన వార్తలే ఉంటున్నాయి. ఈ రోజు పేపర్లో రెండు వార్తలు ఆకట్టుకున్నాయి. మొదటిది ముద్దుల దినోత్సవం స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రేమికులకు నిరాశ పరిచింది అనే వార్త. మరొకటి ఈ వ్యాధి భయం వల్ల తిరుమలలో రద్దీ తగ్గిందనే వార్త.

ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా గురువారం 'ముద్దు' ముచ్చట తీర్చుకోవాలనుకున్న ప్రేమికులు స్వైన్ భయంతో వెనక్కు తగ్గారట! ఈ దినాల సంస్కృతి ఇటీవల బాగా పెరిగి యువతలో క్రమశిక్షణా రాహిత్యాన్ని, విచ్చలవిడి తత్వాన్ని, బరితెగింపును ప్రేరేపిస్తున్న ఈ తరుణంలో స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని ముద్దు కాస్త రద్దు కావటం చాదస్తులకు కాస్త మోదాన్ని కలిగించే విషయమే!

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనానికి విపరీతమైన రద్దీ వుండాల్సిన దసరా శెలవుల్లో రోజూ 50 వేలకు మించి భక్తులు కూడా దర్శించటానికి రావటం లేదంటే స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. తిరుమలలో స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా టి.టి.డి ముందస్తు ఏర్పాట్లు చేసినా భక్తుల్లో భయం తగ్గలేదట! ఈ స్వైన్‌ఫ్లూ ఎఫెక్ట్ వేంకటేశ్వర స్వామి పైన కూడా పడటం భక్తుల్లో కొంత ఖేదాన్ని కలిగించే విషయమేకదా!