...

...

7, మే 2019, మంగళవారం

క్రీడాకథ కథాసంకలనం ఆవిష్కరణ దృశ్యాలు


కోడీహళ్లి మురళీమోహన్ 

కస్తూరి మురళీకృష్ణ

నందిని సిధారెడ్డి


మామిడి హరికృష్ణ

తొలి ప్రతిని స్వీకరిస్తున్న అయాచితం శ్రీధర్ దంపతులు
కె.పి.అశోక్ కుమార్






4, జనవరి 2019, శుక్రవారం

తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు – పుస్తక పరిచయం


గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ భావాల ప్రభావంతో సమాజానికి సందేశ రూపంలో, తెలుగు కథకులు రచించిన కథలను సంకలనం చేయాలని ‘గాంధేయ సమాజ సేవా సంస్థ’ మండలి బుద్ధప్రసాద్ పూనుకుని, సంకలన బాధ్యతలను చేపట్టవలసిందిగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గార్లను అభ్యర్థించారు. వీరిద్దరూ కృషి చేసి – గాంధీజీ కేంద్రంగా వచ్చిన కథలు, సమాజంపై గాంధీజీ ప్రభావాన్ని ప్రతిబింబించే కథలు, ఆధునిక సమాజం ఏ రకంగా గాంధీజీ ప్రభావానికి దూరమవుతూ తత్ఫలితంగా నష్టానికి గురవుతూ గాంధీజీని ఎలా గుర్తుచేసుకుంటుందో చూపించే కథలు ఒక సంకలనంగా తెచ్చారు. అదే “తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు”.
మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శాలను సిద్ధాంతాలను ప్రతిబింబించే ఈ కథా సంకలనంలో “స్వాతంత్ర్య పోరాటం – మహాత్ముడు”, “స్వాతంత్ర్యానంతరం మహాత్ముడు” అనే రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘స్వదేశీ’, ‘అస్పృశ్యత నివారణ’, ‘వ్యక్తిత్వం’, ‘దేశవిభజన’ అనే విభాగాలలో 18 కథలు; రెండవ భాగంలో12 కథలతో మొత్తం 30 కథలు ఉన్నాయి.

కొల్లూరి సోమశంకర్ పుస్తకం.నెట్‌లో వ్రాసిన సమీక్ష పూర్తి భాగం ఇక్కడ చదవండి.