...

...

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

తెవికీలో ఇద్దరు తిరపతోళ్లు

తిరుపతిలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇద్దరు తిరుపతికి చెందిన రచయితల వ్యాసాలు వికీపీడియాలో వ్రాయడానికి కారణం అయ్యింది. లేకపోతే ఈ ఇద్దరి గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో కనిపించడానికి మరికొంత కాలం పట్టేదేమో! ఈ సమావేశాల్లో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ ముందు రోజు మరణించిన ఎస్.మునిసుందరం గురించి ఇంటర్నెట్‌లో వెదికితే సరైన సమాచరం లభించలేదని అన్నారు. రచయిత ఎస్.మునిసుందరం మరణ వార్త అక్కడే తెలిసింది. మునిసుందరం గారు నాకు పరిచయం నా కథాజగత్ ద్వారా. అతని కథ రాయలమ్మ కథాజగత్‌లో ఉంది. అతని చారిత్రక పౌరాణిక నాటకాలపై నా సమీక్ష చదివి వారు నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. ఆదిత్యగారి వ్యాఖ్యకు స్పందించి ఆ రోజే తెలుగు వికీపీడీయాలో మునిసుందరం గారిపై ఒక వ్యాసాన్ని వ్రాశాను. దానిని ఇక్కడ చదవండి. ఆ వ్యాసంలో మునిసుందరం గారికి నూతలపాటి గంగాధరం సాహితీ కుటుంబం తో ఉన్న అనుబంధం తెలిసి నూతలపాటి గంగాధరం గురించి కూడా ఒక వ్యాసం తెలుగు వికీపీడియాలో వ్రాయడం జరిగింది. ఈ వ్యాసాలు చదివి ఆసక్తి కలిగిన వారు ఎవరైన ఈ వ్యాసాలను ఇంకా మెరుగు పరచమని కోరుతున్నాను.

కామెంట్‌లు లేవు: