...

...

2, జనవరి 2013, బుధవారం

పుస్తక సమీక్ష -23 ఆ అరగంట చాలు


[పుస్తకం పేరు: ఆ అరగంట చాలు, రచయిత: కస్తూరి మురళీకృష్ణ, వెల :రూ 100/- ప్రాప్తి స్థానం: కస్తూరి ప్రచురణలు, ప్లాట్ నెం.32, దమ్మాయిగూడ, రఘురాం నగర్ కాలనీ, నాగారం పోస్టు, హైదరాబాదు 500 083, నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 500 027  కినిగె మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద] 

భయానక కథల సంపుటి అని అట్టపైన కనిపిస్తుంది కనుక దానికి మానసికంగా సిద్ధపడే ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ తరహా కథలు వారం వారం పత్రికల్లో చదివితే ఒక రకంగా ఉంటుంది కానీ పదిహేను కథల్ని వరుసగా చదివితే మటుకు భీభత్స రసం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది. జీవితంలో అన్ని రసాలూ చవి చూడాలి గనుక ఇదో తరహా అనుభూతి. మొదటి కథలో భయానకం పలచగా ఉండి తరువాతి కథల్లో క్రమేపీ చిక్కబడుతూ చివరి కథకు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది అనిపిస్తుంది. చేయితిరిగిన రచయిత కాబట్టి ఈ కథలన్నీ చదివిస్తాయనడంలో సందేహం లేదు. అసలు ఈ పుస్తకం తేవడంలో రచయిత ఉద్దేశమేమిటి? ఈ కథల ద్వారా రచయిత ఏం చెప్పదలచుకున్నాడు? ఈ కథల పరమార్థం ఏమిటి? ఎటువంటి సందేశం వీటి ద్వారా లభిస్తుంది? ఈ రచయిత దెయ్యాలు, భూత ప్రేత పిశాచాలు ఉన్నాయని నమ్ముతున్నాడా? నమ్మడంలేదా? మొదలైన సంశయాలను పక్కనపెట్టి ఈ పుస్తకాన్ని చదివితే బాగానే ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి కథ చివరలో మనం ఊహించలేని మలుపును తిప్పుతారు రచయిత. అన్ని కథలు వేటికవే వైవిధ్యంగా ఉన్నాయి. కలకానిదీ,తెల్లపొగ, సాలీడు గూడులో.., అవాహనం కథలు ఎక్కువ నచ్చాయి. మిగతా కథలు కూడా బాగున్నాయి. ఈ పుస్తకం చదవబోయే పాఠకులకు నాదొక సలహా. అన్ని కథలు  ఒకేసారి కాకుండా ఒక కథకు మరొక కథకు మధ్య కనీసం ఓ అరగంట వ్యవధి యిచ్చి చదవండి. ఆ అరగంట చాలు మీరు ట్రాన్స్‌ లోనుండి బయటపడటానికి.    


కామెంట్‌లు లేవు: