...

...

19, డిసెంబర్ 2008, శుక్రవారం

నా గోడు ! -1

నాకు దినచర్య వ్రాసుకునే అలవాటు మొదటి నించీ లేదు. ఇకపై అప్పుడప్పుడూ నా గోడును ఇక్కడ మీకు వినిపిస్తాను. ఈరోజు సాయంత్రం కస్తూరి మురళీ కృష్ణతో కలిసి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో నా పుస్తకాలను రచయితల స్టాల్ లో పెట్టాను. ఆ స్టాల్ లో మాతో పాటు మరో ఇద్దరు మాత్రమే తమ పుస్తకాలను ఉంచారు. ఒకరు గుంటూరు నుంచీ వస్తే మరొకరు హైదరాబాద్ నుంచి వచ్చారు. స్టాల్ అంతా బోసిగా ఉంది. మా అదృష్టం కొద్దీ ఒక్కరు కూడా మా స్టాల్ వైపుకు రాలేదు. కర్ర ఎల్లారెడ్డి, జగన్ రెడ్డి తదితరులు వచ్చారు కాని పుస్తకాలవైపు చూడనే లేదు. బహుశా రేపటి నుంచీ ప్రదర్శకుల సంఖ్య పెరగ వచ్చు. అప్పుడు మా స్టాల్ కు కూడ చూడడానికి కొందరు వస్తారు అని ఆశిస్తున్నాను. కస్తూరి తమ బ్లాగర్లను మా స్టాల్ కు పట్టుకొచ్చారు. మహేష్ కస్తూరి పుస్తకాలను కొన్నారు. మా కొట్లో మొదటి బోణీ కావడం మాకు ఆనందాన్నిచ్చింది. మహేష్ గారికి ధన్యవాదాలు. ఈ పది రోజుల్లో నా పుస్తకం ఒకటైనా అమ్ముడు పోదా? వేచి చూడాలి.

3 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

కిం వో త్వాం

mmkodihalli చెప్పారు...

అహం బ్రహ్మోస్మి!!

భావకుడన్ చెప్పారు...

ఏమిటో మీరిద్దరూ దేవ భాషలో మాటాడేసుకుంటున్నారు? మాకు అర్థం కాలేదండి :-)