...

...

29, జనవరి 2011, శనివారం

శాలువా!

 "మనకేమి జమీందారులం. పది ఎకరాల మామిడి తోట, పదిహేనెకరాల మాగాణీ, పాతికెకరాల మెట్ట. వ్యవసాయానికి కొత్త వరవడి దిద్ది రాజనాలు పండించిన రైతుబిడ్డను. ఊరిపెద్దగా, ఉత్తమ రైతుగా గౌరవించి ముఖ్యమంత్రి కప్పిన శాలువా నా భుజం మీద ఉన్నంతవరకు ఈ ఊరి బాధ్యత మనం మోయాల్సిందే. బాధ్యతన్న తరువాత కొన్ని బాధలు తప్పవు. అంతమాత్రానికే మన జమీందారీ పోద్దా?" అన్నాడు శంకరయ్య.
 
    "పేరుకేమో జమీందారు, పూటకు మాత్రం కరువు. వెనకటికొకడు వక్క పుటుక్కున కొరికాడంట. 'ఈ బల్లిపల్లి సంస్థానంలో ఇంత నిర్భయంగా ఎవడ్రా వక్క కొరికింది?' అన్నాడట సంస్థానాధీశుడు. కొరికినోడు 'నేనే స్వామీ' అన్నాడట భయపడుతూ. 'అయితే సగమిట్టా పంపించు' అన్నాడట ఆ సంస్థానాధీశుడు" శంకరయ్యకు ఒకటే నవ్వు. పార్వతమ్మ కూడా నవ్వుతూ "మన సమస్థానమూ అంతే. తోట, మాగాణి అంతా అడుమానం పెట్టి అప్పు తెస్తివి. అది తీరేది కాదు. భూమి మనకు దక్కేది కాదు. పోనీ పిల్లవాడికైనా మన బాధ చెప్పుకుందామంటే ఒప్పుకోకపోతివి."
 
    శంకరయ్య పార్వతమ్మ వైపు సాలోచనగా చూస్తూ "నేను వాడికి తండ్రినే. కొడుకును కాదు. వాడు ఏదడిగినా తండ్రిగా ఇంతకాలం ఇస్తూనే వచ్చాను. ఇవ్వడంలో వున్న ఆనందం తీసుకోవడంలో వుండదు. అందుకే నేను ఎప్పుడూ ఇస్తూనే వుంటాను. ఆఖరున ఈ ఊరిని కూడా వాడికే ఇస్తాను."
 
పిడుగు పాపిరెడ్డిగారి కథ శాలువాలోనిది ఈ సన్నివేశం. కథను పూర్తిగా చదవడానికి కథాజగత్ చూడండి.