...

...

27, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత!- 8

1.ఒక కాలనీలో ఐదుగురు సాహితీ వేత్తలు ప్రక్కప్రక్కనే నివసిస్తున్నారు. కాంట్రాక్టరు వృత్తిలో ఉన్న వ్యక్తి ప్రభవ - విభవ అనే పుస్తక రచయిత ఇంటి ప్రక్కన నివసిస్తాడు.
2.పెరుమాళ్ళు భావయుక్తం అనే గ్రంథం వ్రాశాడు; పద్యకవి సరస్వతీమహల్‌లో ఉంటున్నాడు.
3.సులేమాన్ కథారచయిత; విక్రమపరాక్రమం అనే కృతికర్త ఇంటిపక్కనే ఇంజనీరు నివాసముంటాడు.
4.సరస్వతీ మహల్ డైమండ్ ప్లాజాకు కుడిప్రక్కన ఆనుకుని ఉంది.
5.అధ్యాపక వృత్తిలో ఉన్న సాహితేవేత్త మన్మథచాపం అనే పుస్తకాన్ని రచించాడు; వచనకవి మధ్య ఇంట్లో ఉంటాడు.
6.కార్తికేయ నందసదనంలో నివాసం చేస్తున్నాడు; కాంట్రాక్టరు ఆనంద్ విల్లాలో ఉంటున్నాడు.
7.వ్యాసకర్త ఒక కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు; అయ్యంగార్ మొదటి ఇంట్లో ఉంటాడు.
8.లింగోజి ఒక వ్యాపారి; అయ్యంగార్ లక్ష్మీ నివాస్ ప్రక్కనే నివసిస్తున్నాడు.
9.ప్రతి వ్యక్తీ వేర్వేరు ఇళ్ళలో ఉంటూ,వేర్వేరు వృత్తులు చేస్తూ, వేర్వేరు ప్రక్రియలను ప్రవృత్తిగా చెపట్టి, వేర్వేరు పుస్తకాలు వ్రాశారు.


పై వివరాల ప్రకారం సౌమ్యమనస్విని అనే గ్రంథాన్ని వ్రాసిందెవరు?

1 కామెంట్‌:

mmkodihalli చెప్పారు...

సౌమ్య మనస్విని అనే గ్రంథాన్ని వ్రాసింది లింగోజి.