...

...

29, ఆగస్టు 2010, ఆదివారం

విజయవంతంగా ముగిసిన తెలుగుబాట!











తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా e-తెలుగు వారు నిర్వహించిన తెలుగు బాట కార్యక్రమం దిగ్విజయమయ్యింది. ఈ కార్యక్రమ విశేషాలు ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు లభించిన మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. లేకపోతే భమిడిపాటి ఫణిబాబు, శరత్‌కాలం శరత్, తాడేపల్లి లల్లితాబాల సుబ్రహ్మణ్యం, ఎస్.రాము లాంటి వారిని కలుసుకునేవాడిని కానేమో! మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వీవెన్, తుమ్మల శిరీష్ కుమార్, కాశ్యప్, చక్రవర్తి, సుజాత మరియు ఇతర e-తెలుగు బృందానికి నా అభినందనలు.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు.

..nagarjuna.. చెప్పారు...

అభినందనలు

durgeswara చెప్పారు...

అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

అందరికంటే ఎక్కువ శ్రమపడింది సతీష్ కుమార్ యనమండ్ర!

mmkodihalli చెప్పారు...

@అజ్ఞాతలు, నాగార్జున, దుర్గేశ్వర మీ కౌంటర్లకు ధన్యవాదాలు. రెండవ అజ్ఞాతా నిజమే. సతీష్ తోపాటు అందరు యువకులూ చాలా చక్కగా పనిచేశారు. అందరికీ నా అభినందన మందారాలు. నేనే పాల్గొనడం, నినదించడం మినహా ఏమీ చేయలేక పోయాను.

Sandeep P చెప్పారు...

చాలా చక్కని కార్యంలో చేయి కలపలేనందుకు బాధపడుతున్నాను అండి. మీరందరూ ఆ కార్యాన్ని దిగ్విజయం చేసినందుకు అభినందనలు, తెలుగుతల్లి బిడ్డగా పాదాభివందనాలు!