...

...

27, జులై 2010, మంగళవారం

కవితాభిషేకం! - 22


సీ. కవికోటి బోషించి గ్రంథముల్ వ్రాయించి
              ’యాంధ్ర భోజుండ’ని ఖ్యాతి బెంచె,
    రాజుల నోడించి ’రాజాధిరాజ మ
              హరాజ’ బిరుద విఖ్యాతి గాంచె,
    గజపతీంద్రుల రణాంగణమందణచి ’మూరు
              రాయల గండ’డన్ ప్రణుత నించె
    విశ్వంబు వెఱగొంద ’వీరప్రతాప మా
              ర్తాండ’ సత్కీర్తి నొందంగ మించె,

గీ. రాజకీయ కార్యముల, సారస్వతమున
    దక్షిణాపథమేలిన ధరణి పతుల
    నింత రాజింక లేడను నంతవాడు
    కృష్ణరాయల బోలు భూమీశుడున్నె.

                        - దుర్భాక రాజశేఖర శతావధాని.


కామెంట్‌లు లేవు: